నా భూమిని ఆక్రమించారు
ABN, First Publish Date - 2023-06-26T00:23:42+05:30
తనకు చెందిన భూమిని వైసీపీ సర్పంచ్ ప్రతినిఽధి డబ్బాడ వెంకటరమణ ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వీఆర్ అగ్రహా రం గ్రామానికి చెందిన జనపాల శ్రీధర్ ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేశారు.
రాజాం రూరల్: తనకు చెందిన భూమిని వైసీపీ సర్పంచ్ ప్రతినిఽధి డబ్బాడ వెంకటరమణ ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వీఆర్ అగ్రహా రం గ్రామానికి చెందిన జనపాల శ్రీధర్ ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాం సీఐ రవికుమార్ ఆదివారం రాత్రి డబ్బాడ వెంకటరమణపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. వీఆర్ అగ్రహారం గ్రామం లో జనపాల శ్రీధర్కు 72 సెంట్లు భూమి ఉందని, ఆ భూమి అతనికే చెందుతుం దని గతంలో రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరించిందని సీఐ తెలిపారు. అయితే ఇటీవల శ్రీధర్ తనకు చెందిన భూమిని చదును చేసేందుకు వెళ్లే సమయంలో వెంకటరమణ అడ్డుకుని తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు.
Updated Date - 2023-06-26T00:23:42+05:30 IST