ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే దాడి
ABN, First Publish Date - 2023-01-29T03:03:47+05:30
అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదా లు భగ్గుమన్నాయి. శనివారం నాగాయలంక పర్యటనకు వచ్చిన నాబార్డు చైర్మన్ షాజీ, ఎంపీ బాలశౌరి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే..
నాబార్డు చైర్మన్ షాజీ కళ్లెదుటే ఘటన.. అవనిగడ్డ వైసీపీలో విభేదాలు
విజయవాడ, జనవరి 28: అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదా లు భగ్గుమన్నాయి. శనివారం నాగాయలంక పర్యటనకు వచ్చిన నాబార్డు చైర్మన్ షాజీ, ఎంపీ బాలశౌరి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే.. ఎంపీ బాలశౌరి ప్రధాన అనుచరుడైన గరికపాటి శివపై ఎమ్మె ల్యే సింహాద్రి రమే్షబాబు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేతోపాటు అవనిగడ్డ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మేనల్లుడు రేపల్లె దామోదర్, ఎమ్మెల్యే కుమారుడు సింహాద్రి వికాస్లు ఈ దాడిలో పాల్గొనట్లు వీడియోలు వైర ల్ అవ్వడంతో ఈ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది.
Updated Date - 2023-01-29T03:03:48+05:30 IST