చికిత్స పొందుతూ వివాహిత మృతి
ABN, First Publish Date - 2023-06-26T23:45:40+05:30
బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన గెంబలి హారిక(33) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిందని డీఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు.
బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన గెంబలి హారిక(33) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిందని డీఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురానికి చెందిన హారికకు బొబ్బిలికి చెందిన గెంబలి కళ్యాణ చక్రవర్తితో 2016లో వివాహ మయ్యింది. పెళ్లయిన కొద్ది నెలల నుంచి వారికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. హారిక పార్వతీపురంలో వలంటీరుగా పనిచేస్తోంది. ఇంట్లో గొడవల కారణంగా ఆమె ఈనెల 13న ఆత్మహత్య చేసుకునేందుకు ఫ్లోర్ క్లీనింగ్ రసాయనాన్ని తాగింది. అస్వస్థతకు గురైన ఆమెను స్థానిక సీహెచ్సీలో చేర్పించి, మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఈ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగేశ్వరరావు ఉన్నారు.
Updated Date - 2023-06-26T23:45:40+05:30 IST