ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ బోల్తా.. డ్రైవర్‌ మృతి

ABN, First Publish Date - 2023-03-31T00:06:32+05:30

కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదు పు తప్పి బోల్తా పడగా, అదే లారీ కిందపడి డ్రైవర్‌ మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బొండపల్లి: కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదు పు తప్పి బోల్తా పడగా, అదే లారీ కిందపడి డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన బోడసింగి పేట గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం వేకువజామున చోటుచేసు కుంది. ఈ ఘటన పై స్థానిక ఎస్‌ఐ ఎస్‌.రవి తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామానికి చెందిన రెడ్డి శ్రీరాములు(55) గత కొన్ని సంవత్సరా లుగా బతకుతెరువు కోసం రాయగడ వెళ్లి భార్యబిడ్డలతో నివాసం ఉంటూ లారీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో విజయ నగరం నుంచి సరుగుడు కర్రల లోడుతో వస్తున్నాడు. బోడసింగిపేట గ్రామానికి సమీపంలోని సాయిసిద్ధార్థ కళాశాలకు ఆనుకొని ఉన్న జాతీయ రహదారిపైకి వచ్చేసరికి లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కర్రలు డ్రైవర్‌పై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి, కర్రల కింద ఇరుక్కుపోయిన మృతదేహాన్ని రెండు గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి నలుగురు కుమారులతోపాటు భార్య ఉంది.

Updated Date - 2023-03-31T00:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising