ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ప్రభుత్వంలో ఎస్టీలకు అన్యాయం

ABN, First Publish Date - 2023-01-26T00:29:27+05:30

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జిల్లా ఎస్టీ ఏకలవ్య సంఘ అధ్యక్షుడు, గజరాయనివలస టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు పాలవలస గౌరు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాడంగి, జనవరి 25: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జిల్లా ఎస్టీ ఏకలవ్య సంఘ అధ్యక్షుడు, గజరాయనివలస టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు పాలవలస గౌరు అన్నారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో 35 గిరిజన తెగలు 37 స్కీముల ద్వారా స్వయం ఉపాధి పొందేవారమని, ఐటీడీఏ ద్వారా జిల్లాలోని వందలాది కుటుంబాలకు ఉపాధి దొరికేదన్నారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో వీటి ద్వారా ఒక్క పథకం కూడా మంజూరుకావడం లేదన్నారు. లక్ష్మీపురం మధుర గ్రామమైన ఎరుకుల పాకల్లో 2006లో రూ.200ల పెన్షన్‌ పొందుతూ 2022లో రూ.2,500ల పెన్షన్‌ తీసుకునేవారని, నేడు ఈ ప్రభుత్వం వివిధ కారణాలు చూపి పదుల సంఖ్యలో పింఛన్లు తొలగించడం అన్యాయమన్నారు. తక్షణమే ఎరుకుల పాకల్లో ఉన్న పింఛన్లు కోల్పోయిన వారికి నేరుగా వైద్య పరీక్షలు నిర్వహించి వయస్సు ఆధారంగా వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కోరారు. లక్ష్మీపురం సర్పంచ్‌ పాలవలస పార్వతి, పెన్షన్లు తొలగిపోయిన వారు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising