ఎ(గు)ంత ప్రమాదం?
ABN, First Publish Date - 2023-06-01T00:19:20+05:30
టెలికాం కేబుల్ వైర్లు వేసేందుకు రహదారులపై తవ్వుతున్న గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గుంతలను పూడ్చకుండా వదిలేస్తుండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
టెలికాం కేబుల్ వైర్లు వేసేందుకు రహదారులపై తవ్వుతున్న గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గుంతలను పూడ్చకుండా వదిలేస్తుండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఓ టెలికాం సంస్థకు చెందిన కేబుల్ వైర్లు వేసేందుకు రెండు నెలలు కిందట కొత్తవలస-విజయనగరం రహదారిపై గుంతలను తవ్వారు. కొత్తవలస జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఈ గుంతలను పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో బుధవారం విజయనగరం నుంచి విశాఖకు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనచోదకుడు గుంతను గమనించక పోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. బైక్ ముందు భాగమంతా గుంతలో కూరుకుపోయి పూర్తిగా పాడైపోయింది. అతను స్వల్వ గాయాలతో బయటపడ్డాడు. ఇటువంటి గుంతలను తక్షణమే పూడ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
-కొత్తవలస
Updated Date - 2023-06-01T00:19:20+05:30 IST