కేఎల్ వలసలో ఐదిళ్లు అగ్నికి ఆహుతి
ABN, First Publish Date - 2023-06-11T23:52:58+05:30
కొండ లింగాలవలస గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు అగ్నికి ఆహుత య్యాయి.
మెంటాడ: కొండ లింగాలవలస గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు అగ్నికి ఆహుత య్యాయి. సుమారు రూ.5లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం బంగారమ్మ గ్రామదేవత గుడిలో పూర్ణకుంభం నెలకొల్పే క్రమంలో భాగంగా గ్రా మస్థులు జక్కువ గ్రామానికి వెళ్లారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం సంభవిం చినట్లు స్థానికులు చెబుతున్నారు. డోల శంకరరావు, కోటేశ్వరరావు, సన్యాసిరావు, నాగమ్మ, తిరుపతమ్మల ఇళ్లు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమా దంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గ్రామంలో పెద్దలు లేకపోవడం, సిలిండర్లు ఎగిసిపడడంతో మంట లు ఆర్పేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. కట్టుబట్టలు మినహా ప్రమా దంలో సర్వం కాలిపోయాయి. సుమారు రూ.5లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. ఇంట్లో వెలిగించిన దీపాన్ని ఎలుకలు తీసుకుపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అంతా భావిస్తున్నారు.
Updated Date - 2023-06-11T23:52:58+05:30 IST