అత్యవసర పరిస్థితి చరిత్రలో చీకటి రోజు
ABN, First Publish Date - 2023-06-25T23:57:08+05:30
అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని తెలిపారు. 1975 జూన్ 25 దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం విదితమే. బీజేపీ చీకటి రోజుగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా రెడ్డి పావని ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలో అందరిపై నిఘాఉంచి, పత్రికలపై ఆంక్షలు విధిస్తూ సెన్సార్ చేసిన అనంతరం ప్రజలకు చేరేవన్నారు.బలవంతపు కుటుంబనియంత్రణ, వాక్ స్వాతంత్య్రం లేకుండా ప్రజలను భయబ్రాంతులు గురచేశారని తెలిపారు. ఎందరో దేశభక్తులను జైలు పాలుచేసిన దుర్ధినమన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు.కార్యక్రమంలో బీజెపీ నాయకు లు హరినాథ్, బగ్గం వినీత, నానాజీ, బిలాల్ మహ్మాద్, గొంటి పద్మ పాల్గొన్నారు.
విజయనగరం దాసన్నపేట: అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని తెలిపారు. 1975 జూన్ 25 దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం విదితమే. బీజేపీ చీకటి రోజుగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా రెడ్డి పావని ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలో అందరిపై నిఘాఉంచి, పత్రికలపై ఆంక్షలు విధిస్తూ సెన్సార్ చేసిన అనంతరం ప్రజలకు చేరేవన్నారు.బలవంతపు కుటుంబనియంత్రణ, వాక్ స్వాతంత్య్రం లేకుండా ప్రజలను భయబ్రాంతులు గురచేశారని తెలిపారు. ఎందరో దేశభక్తులను జైలు పాలుచేసిన దుర్ధినమన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు.కార్యక్రమంలో బీజెపీ నాయకు లు హరినాథ్, బగ్గం వినీత, నానాజీ, బిలాల్ మహ్మాద్, గొంటి పద్మ పాల్గొన్నారు.
Updated Date - 2023-06-25T23:57:08+05:30 IST