తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-06-01T00:09:31+05:30
తల్లి మందలించింద నే మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుం దని ఎస్ఐ ఆర్.జయంతి తెలిపారు.
బాడంగి: తల్లి మందలించింద నే మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుం దని ఎస్ఐ ఆర్.జయంతి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని ఆకులకట్ట గ్రామానికి చెందిన మేకల భవాని(15) అనే బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టి, చదవడం లేదని తన తల్లి మందలించింది. దీంతో ఈనెల 25వ తేదీన ఇంట్లో ఎవరూలేని సమయంలో భవాని ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కొంత సమయానికి కుటుంబ సభ్యులు గమనించి కాపాడి చికిత్స కోసం బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరలించి ఆపై విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతిచెందింది. మృతురాలి తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు.
Updated Date - 2023-06-01T00:09:31+05:30 IST