ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చీపురుపల్లి టీడీపీ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం

ABN, First Publish Date - 2023-07-26T00:24:42+05:30

చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 10.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం (విజయవాడ)లో సమావేశం కానున్నారు.

చీపురుపల్లి టీడీపీ నేతలతో

నేడు చంద్రబాబు సమావేశం

విజయనగరం రూరల్‌, జూలై 25: చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 10.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం (విజయవాడ)లో సమావేశం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్న చంద్రబాబు.. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. పార్టీ నుంచి సమాచారం అందుకున్న టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం రోడ్డు మార్గాన విజయవాడకు పయనమయ్యారు. కిమిడి నాగార్జునతో పాటు పార్టీ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు వెళ్లారు. సమీక్షలో ఇదేమి ఖర్మ రాష్ట్రానికి, భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర, ఓటర్‌ ఐడెంటిఫికేషన్‌, వెరిఫికేషన్‌ (ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌), బీఎల్‌ఏల నియామకం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ విజయానికి ఏమి చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నారు.

----------

Updated Date - 2023-07-26T00:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising