ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1988లో వచ్చారు..

ABN, First Publish Date - 2023-05-23T00:10:29+05:30

ప్రముఖ సినీనటుడు శరత్‌బాబు(71) మరణాన్ని జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన లేరనే విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాటి జ్ఞాపకాల్లో పట్టణవాసులు

సాలూరు రూరల్‌, మే 22: ప్రముఖ సినీనటుడు శరత్‌బాబు(71) మరణాన్ని జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన లేరనే విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన శరత్‌బాబుకు సాలూరుతో అనుబంధం ఉంది. పట్టణంలో ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు గంటా వెంకటరాజు 1988లో అయ్యప్ప మాలధారణ చేసి, తన ఇంటి వద్ద అంబలం పూజ నిర్వహించారు. ఈ పూజకు సినీగాయకుడు ఆనంద్‌, సినీనటుడు శరత్‌బాబులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శరత్‌బాబు 1988, డిసెంబర్‌లో సాలూరు వచ్చి అయ్యప్పస్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన కూడా అయ్యప్పస్వామిపై ఒక గీతం పాడినట్టు గంటా వెంకటరాజు సోమవారం చెప్పారు. శరత్‌బాబుతో నాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి సాలూరు సాహితీమిత్రబృందం, కబీర్‌షా ఆర్కెస్ట్రా, కళాస్రవంతి ప్రతినిధులు తిరుమలాచార్యులు, చందు మాస్టార్‌, రాంప్రసాద్‌, భాషా, గణపతి, కృష్ణకుమారి, శ్రీనివాసరావు,జోగినాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-23T00:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising