గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
ABN, First Publish Date - 2023-01-26T00:34:26+05:30
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పోలీసు పరేడ్ గ్రౌండ్ను సుందరంగా తీర్చిదిద్దారు. స్టాళ్లు, సంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రయాణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికను ప్రత్యేకంగా అలంకరించారు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి
ఉత్తమ పురస్కారానికి 450 మంది ఉద్యోగుల ఎంపిక
కలెక్టరేట్, జనవరి 25: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పోలీసు పరేడ్ గ్రౌండ్ను సుందరంగా తీర్చిదిద్దారు. స్టాళ్లు, సంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రయాణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ఆర్డీవో సూర్యకళ గ్రౌండ్లో ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. వేడుకల్లో కలెక్టర్ సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారు. ప్రభుత్వశాఖల పనితీరును తెలిపేలా 12 శకటాలను తయారు చేశారు. 8 స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఉత్తమ సేవా పురస్కారానికి సుమారు 450 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ఎంపిక చేశారు. వీరందరికీ జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను ఇవ్వనున్నారు.
Updated Date - 2023-01-26T00:34:27+05:30 IST