19 వార్డులో మౌలిక వసతులు కల్పిస్తాం
ABN, First Publish Date - 2023-02-07T00:10:54+05:30
జీవీఎంసీ పరిధిలోని 19వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ పి. రాజాబాబు తెలిపారు. సోమవారం ఆయన వార్డు పరిధిలోని పెదజాలారిపేట, శివగణేష్నగర్, రేసవానిపాలెం ప్రాంతాల్లో కార్పొరేటర్ నొల్లి నూకరత్నతో కలిసి పర్యటించారు.
పెదవాల్తేరు, ఫిబ్రవరి 6 : జీవీఎంసీ పరిధిలోని 19వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ పి. రాజాబాబు తెలిపారు. సోమవారం ఆయన వార్డు పరిధిలోని పెదజాలారిపేట, శివగణేష్నగర్, రేసవానిపాలెం ప్రాంతాల్లో కార్పొరేటర్ నొల్లి నూకరత్నతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డులో వున్న గెడ్డలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను అదేశించారు. పెదజాలారిపేటలో గెడ్డ నిర్మాణం, వీధి దీపాలు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, ఈపీడీసీఎల్ గోతుల పూడ్చి వేత, తదితర సమస్యలపై స్థానికులు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం కుర్పాం సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు చేసే ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ప్రధాన వైద్యాధికారి కేఎస్ఎల్జీ శాస్త్రి, డిసి (రెవెన్యూ) ఫణీరామ్, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి, పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ఏఎంఓహెచ్ డాక్టర్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-07T00:10:59+05:30 IST