ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వీవీ రమణకు ఘన నివాళి

ABN, First Publish Date - 2023-06-26T00:09:32+05:30

రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ వీవీ రమణ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీలో గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద వీవీ రమణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమ్మపాల, జూన్‌ 25 : రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ వీవీ రమణ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీలో గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పార్టీ నాయకులు, రైతులతో కలిసి వీవీ రమణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పాలిట వీవీ రమణ దేవుడని కొనియాడారు. రమణ పలు పోరాటాలు చేసి రైతులకు మేలు చేకూర్చారన్నారు. తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీని స్థాపించిన వీవీ రమణ ఆశయం నెరవేర్చాలంటే కచ్చితంగా ఫ్యాక్టరీని తెరిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సుగర్‌ ఫ్యాక్టర్‌పై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బూటకపు హామీలిచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని మోసగించిందన్నారు. అలాగే వీవీ రమణ విగ్రహానికి రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రి బాబి, కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి బోసుబాబు, చదరం కాశీ, కంకణాల ఆదిమూర్తి, గొర్లి మోదినాయుడు, నడిపల్లి గణేష్‌, షుగర్‌ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు ఏవీ నూకేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising