ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తాం

ABN, First Publish Date - 2023-05-02T01:01:23+05:30

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాయల మురళీ, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి హామీ ఇచ్చారు.

ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కశింకోట, మే 1 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాయల మురళీ, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి హామీ ఇచ్చారు. మండలంలోని కొత్తపల్లిలో సోమవారం ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిస్తే జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులమయం అయ్యిందని ఆరోపించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనకాపల్లి నియోజకవర్గంలోని 6 వేల మంది పింఛన్లను తొలగించారని ఆరోపించారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి వైసీపీ నిరంకుశ పాలనపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుదిరెడ్డి అప్పడు, బుదిరెడ్డి గంగయ్య, రెడ్డి రామారావు, గోవింద, సూరిబాబు, కలగా సోమేశ్వరరావు, సిద్దిరెడ్డి సూర్యనారాయణ, నైనంశెట్టి రమణారావు, ద్వారపురెడ్డి సత్తిబాబు రమేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T01:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising