రైలు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2023-06-07T00:46:08+05:30
ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు.
తుమ్మపాల, జూన్ 6 : ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పట్టణంలోని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ప్రమాదంపై క్షేత్రస్థాయిలో దర్యాప్తును చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలారపు త్రినాథ్, బొద్దపు ప్రసాద్, సబ్బవరపు గణేష్, ఆళ్ల రామచంద్రరావు, ఆకుల నానాజీ, సూరే సతీష్కుమార్, ధనాల విష్ణుచౌదరి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T00:46:08+05:30 IST