ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN, First Publish Date - 2023-03-19T01:03:54+05:30

అంగన్‌వాడీ కేంద్రాల్లో తక్కువ బరువున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ శ్రీవాత్సవ, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తక్కువ బరువున్న వారిపై పర్యవేక్షణ

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం

గిరిజన ప్రాంతాల్లో అంగన్‌వాడీ సేవలను మెరుగుపర్చాలని సూచన

పాడేరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో తక్కువ బరువున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో ఐసీడీఎస్‌ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నారులు ఆహారం సరిగా తీసుకోకుంటే, అందుకు గల కారణాలను డాక్టర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని బరువు తక్కువగా ఉన్న చిన్నారులను రెండు వారాలు ప్రత్యేకంగా పర్యవేక్షించడంతోపాటు మెనూ ప్రకారం పోషకాహారాన్ని క్రమంగా పెడితే, బరువు పెరగడంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. మరీ తక్కువ బరువున్న చిన్నారులను స్థానిక జిల్లా ఆస్పత్రిలోని పౌష్టికాహార పునరావాస కేంద్రంలో చేర్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలను మెరుగుపరచాలని, చిన్నారుల పట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సూపర్‌వైజర్లు వారానికి ఐదు రోజులు అంగన్‌వాడీ కేంద్రాలను పక్కాగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించే ఫొటోలను సమర్పించాలన్నారు. తక్కువ బరువు గల పిల్లల కోసం ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించి, ప్రతి రోజు వారి బరువును నమోదు చేయాలన్నారు. ప్రతి వారం తాము వాటిపై సమీక్షిస్తానని, సమావేశానికి వచ్చేటప్పుడు ఆయా రిజిస్టర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన ఫొటోలను తీసుకురావాలని, రక్తహీనతగా ఉన్న తల్లులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎంత మందికి ఆహారం సిద్ధం చేస్తున్నారు?, ఎంత మందికి టేక్‌హోమ్‌ రేషన్‌ పంపుతున్నారనే విషయాలను గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ అశుతోశ్‌ శ్రీవాత్సవ, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising