ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూపు-2 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయండి

ABN, First Publish Date - 2023-06-03T00:43:39+05:30

రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అమరావతిలో గురువారం ఏపీ పీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌, కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌లను గురువారం కలిసి కోరినట్టు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు.

కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌కు వినతి ప్రతాన్ని అందజేస్తున్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చెయ్యపేట, జూన్‌ 2 : రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అమరావతిలో గురువారం ఏపీ పీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌, కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌లను గురువారం కలిసి కోరినట్టు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. గ్రూప్‌-2లో డీఎల్‌, జేఎల్‌, ఏఈఈ ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. గతంలో మంజూరై వేర్వేరు కారణాలతో నిలిచిపోయిన పోస్టుల భర్తీ కూడా చేపట్టాలని విన్నవించామన్నారు. ప్రస్తుతం రెండు వందల గ్రూప్‌-2 పోస్టులకు ఆర్థిక అనుమతులు లభించాయని, మిగిలిన వాటికి ఆర్థిక అనుమతులు లభించిన వెంటనే వాటి భర్తీకి సైతం చర్యలు చేపడతామని గౌతం సవాంగ్‌ చెప్పినట్టు ఎమ్మెల్సీ తెలిపారు.

Updated Date - 2023-06-03T00:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising