ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు
ABN, First Publish Date - 2023-06-21T00:40:49+05:30
పది, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 1, 2 ర్యాంకులను సాధించిన తానాం ప్రభుత్వ గరుకుల పాఠశాల ఇద్దరి విద్యార్థినులకు జగనన్న ఆణిముత్యాల పథకం కింద రూ.లక్ష, రూ.75 వేలు చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
పరవాడ, జూన్ 20: పది, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 1, 2 ర్యాంకులను సాధించిన తానాం ప్రభుత్వ గరుకుల పాఠశాల ఇద్దరి విద్యార్థినులకు జగనన్న ఆణిముత్యాల పథకం కింద రూ.లక్ష, రూ.75 వేలు చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద గల ఏ కన్వర్షన్ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇంటర్ విద్యార్థిని భాగ్యశ్రీ (స్టేట్ ఫస్ట్,) పదో తరగతి విద్యార్థిని రొంగల నిరీక్షత ( స్టేట్ రెండో ర్యాంక్)లకు సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా చెక్కు, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ మీసాల అప్పలనాయుడుకు షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-21T00:40:49+05:30 IST