ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను మభ్య పెట్టడానికే రాజధాని ప్రకటన

ABN, First Publish Date - 2023-02-02T01:26:08+05:30

ప్రజలను మభ్య పెట్టడానికే జగన్‌రెడ్డి విశాఖ రాజధాని ప్రకటన చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏకేపీ టౌన్‌ 7 : సమావేశంలో మాట్లాడుతున్న నాగజగదీశ్వరరావు

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 1 : ప్రజలను మభ్య పెట్టడానికే జగన్‌రెడ్డి విశాఖ రాజధాని ప్రకటన చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి ప్రజాదరణ తగ్గుతుందని ఇండియా టూ డే సీ ఓటర్‌ సర్వేలో తేటతెల్లం కావడం, వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి మూలాలు బయటకు రావడంతో ప్రజలను మభ్యపెట్టడానికే విశాఖ పరిపాలన రాజధాని ప్రకటన చేశారని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం దావోస్‌ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది అని పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, కంపెనీ ప్రతినిధులు ప్రశ్నించారన్నారు. దానికి అనుగుణంగా మంగళవారంనాటి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో జగన్‌రెడ్డి విశాఖ పరిపాలనా రాజధాని అని, సీఎం క్యాంప్‌ కార్యాలయం తరలిస్తున్నామని ప్రకటించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిం చేందుకు అంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు వేగి వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising