అర్హులందరికీ నేతన్న నేస్తం
ABN, First Publish Date - 2023-06-26T00:11:27+05:30
జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం సాయం అందజేస్తామని జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ తెలిపారు.
ఏడీ మురళీకృష్ణ
నక్కపల్లి, జూన్ 25 : జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం సాయం అందజేస్తామని జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం నక్కపల్లిలో నేతన్న నేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న మగ్గాలను ఏడీ మురళీకృష్ణ, డీఓ రమణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 250 మగ్గాలకు అర్హత కలిగిందని, ఈ ఏడాది 270 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 20 వరకు అనర్హత కలిగినవిగా గుర్తించామన్నారు. అర్హులందరికీ రూ.24వేలు చొప్పున సీఎం జగన్మోహన్రెడ్డి త్వరలో బ్యాంకు ఖాతాలను జమచేస్తారని ఆయన తెలిపారు. ఆయన వెంట వార్డు సభ్యులు బంగార్రాజు, సొసైటీ ఇన్చార్జి నాగబాబు ఉన్నారు.
Updated Date - 2023-06-26T00:11:27+05:30 IST