ఇదేం తర‘గతి’!
ABN, First Publish Date - 2023-03-26T04:04:09+05:30
ఈ తరగతి గదిని చూశారా! ఒకే గదిలో ఒకటి నుంచి ఐదు తరగతులు బోధిస్తున్నారు.
ఈ తరగతి గదిని చూశారా! ఒకే గదిలో ఒకటి నుంచి ఐదు తరగతులు బోధిస్తున్నారు. గదిలో నాలుగు మూలల్లో నాలుగు, మధ్యలో ఐదో తరగతి నిర్వహిస్తున్నారు. మొత్తం 70 మంది పిల్లలకు ముగ్గురు టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. పాఠాలైతే చెబుతున్నారు గానీ.. ఎవరేం చెబుతున్నారో అర్థం కాక.. అంతా గందరగోళమే. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని స్వామి వివేకానంద మున్సిపల్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. ఈ పాఠశాలను తొలుత కంసాలపేటలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులు తక్కువగా ఉండడంతో రెండేళ్ల కిందట ఇందిరమ్మ కాలనీకి మార్చారు. ఇక్కడ అద్దె భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవు. నూతన భవన నిర్మాణం రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. నాడు-నేడుతో బడుల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పగా చెబుతున్న వైసీపీ పాలకులు.. ఈ పాఠశాల దుస్థితికి ఏం సమాధానం చెబుతారో? - హిందూపురం అర్బన్
Updated Date - 2023-03-26T04:04:09+05:30 IST