‘పండ్ల రైతులకు సబ్సిడీ’
ABN, First Publish Date - 2023-01-22T01:27:19+05:30
పండ్లు, కూరగాయల తోటలు చెరువుల కింద సాగు చేసే రైతులకు ఏపీఐఐఏపీపీ పథకం ప్రకారం 75 శాతం సబ్సిడీ వస్తుందని ఉద్యానశాఖ అధికారి నరేష్కుమార్రెడ్డి అన్నారు.
రుద్రవరం, జనవరి 21: పండ్లు, కూరగాయల తోటలు చెరువుల కింద సాగు చేసే రైతులకు ఏపీఐఐఏపీపీ పథకం ప్రకారం 75 శాతం సబ్సిడీ వస్తుందని ఉద్యానశాఖ అధికారి నరేష్కుమార్రెడ్డి అన్నారు. శనివారం పేరూరు గ్రామ సమీపంలో రైతులు సాగు చేసిన పండ్లు, కూరగాయల తోటలను పరిశీలించారు. ఈ పథకం కింద పేరూరు, చిన్నకంబలూరు, చందలూరు గ్రామాలను ఎంపిక చేశామన్నారు. సబ్సిడీ ఒక హెక్టారుకు రూ.37,500, మామిడి సాగుకు రూ.24,938, జామ సాగుకు రూ.54,998, అరటికి రూ.76,847, పూల సాగుకు రూ.30 వేలు వర్తిస్తుందని అన్నారు. సచివాలయ కన్వీనర్ తిరుపతిరెడ్డి, సునిల్కుమార్, గ్లోరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-22T01:27:21+05:30 IST