తేలని ట్రక్కుషీట్స్ వ్యవహారం
ABN, First Publish Date - 2023-03-25T23:34:14+05:30
ముక్తాపురం గ్రామానికి చెందిన విష్టప్రసాద్ పండా ధాన్యం లేని రైతులు పేర్లుతో ట్రక్కుషీట్స్ ఇస్తున్నారని టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కూమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
మెళియాపుట్టి: ముక్తాపురం గ్రామానికి చెందిన విష్టప్రసాద్ పండా ధాన్యం లేని రైతులు పేర్లుతో ట్రక్కుషీట్స్ ఇస్తున్నారని టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కూమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని తహసీల్దార్ పి.సరోజిని సబ్కలెక్టర్ ఆదేశించారు. దీన్నిపై శుక్రవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై విచారణకు ఆదేశించడంతో దళారులు అడ్డదారులు తొక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామానికి దర్యాప్తు అధికారి రాకముందే కొంత మంది ధాన్యం వ్యాపారులతో ఒక వైసీపీ నాయకుడు వచ్చి చర్చిలు జరిపారు. ధాన్యం లేకుండా ట్రక్కుషీట్స్ పొందిన రైతులతో మరోసారి ధాన్యం బస్తాల వద్ద ఫొటోలు తీసి వ్యవసాయ అధికారులకు ఇస్తున్నట్టు తెలుస్తుంది.
Updated Date - 2023-03-25T23:34:14+05:30 IST