వైసీపీ పాలనతో ప్రజలకు ఇబ్బందులు
ABN, First Publish Date - 2023-05-02T23:50:40+05:30
వైసీపీ పాలనతో ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రం లో దోపిడీ జరుగుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన అన్నారు. మందస మేజర్ పంచాయతీ పరిధి మేఘమాల, చినబరంపురం గ్రామాల్లో మంగళవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు.
హరిపురం/మందస: వైసీపీ పాలనతో ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రం లో దోపిడీ జరుగుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన అన్నారు. మందస మేజర్ పంచాయతీ పరిధి మేఘమాల, చినబరంపురం గ్రామాల్లో మంగళవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సంద ర్భంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహిచి ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫ ల్యాలను ప్రజలకు వివరించారు. సంక్షేమం పేరుతో అర్హులకు మొండిచేయి చూపించి అనర్హులకు అందిస్తున్నారని ఆరోపించారు. ఒక చేత్తో పథకాలిచ్చి మరో చేత్తో ధరలను పెంచి పన్నులు వేసి దోచుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, బమ్మిడి కర్రయ్య, సిర్ల కృష్ణారావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-02T23:50:40+05:30 IST