మంటల్లో పాత ఎంపీడీవో కార్యాలయం
ABN, First Publish Date - 2023-06-26T00:20:37+05:30
మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం ఆదివారం దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం కార్యాలయం వెనుకవైపు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు వైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు మంటలను గమనించి అగ్నిమాపక కార్యాల యానికి సమాచారం అందించారు.
పొందూరు, జూన్ 25: మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం ఆదివారం దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం కార్యాలయం వెనుకవైపు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు వైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు మంటలను గమనించి అగ్నిమాపక కార్యాల యానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది చేరు కుని మంటలను అదుపుచేశారు. అప్పటికే రికార్డుల గది పూర్తిగా దగ్ధ మైంది. కాగా, ప్రమాద తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు. ఈ పాత కార్యాలయం పక్కనే నూతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఇందులోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, రికార్డులు మాత్రం ఇంకా ఈ గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేప థ్యంలో విలు వైన రికార్డు లు ఉన్న గది దగ్ధం కావడం అనుమానాల కు తావిస్తోంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేక కావాలనే ఎవరై నా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంపై ఎంపీడీవో హరిహరరావు వివరణ కోరగా.. పాత కార్యాలయంలో విలువైన రికార్డులు ఏమీ లేవని, చిత్తుకాగితాలే ఉన్నాయని తెలిపారు.
Updated Date - 2023-06-26T00:20:37+05:30 IST