రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
ABN, First Publish Date - 2023-04-03T00:20:33+05:30
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. అల్లుకోల గ్రామంలో ఆదివారం ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
పలాసరూరల్,ఏప్రిల్ 2: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. అల్లుకోల గ్రామంలో ఆదివారం ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. నిత్యావసర ధరల పెంచడంతో పాటు మద్యపాన నిషేధాన్ని అమలు చేయక పోవడంతో పాటు నిరుద్యో గులకు అన్యాయం చేసిందన్నారు. 2024 ఎన్ని కల్లో టీడీపీని గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్రావు, నాయకులు పోలాకి పాపారావు, తమ్మినేని గంగారాం, ఽవిజయ్, ధనుంజయ, బి.రాజు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T00:20:33+05:30 IST