వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
ABN, First Publish Date - 2023-02-15T00:10:42+05:30
రావివలస పంచాయతీ చిన్న నారాయణపురానికి చెందిన పలువురు వైసీపీ నేతలు మంగళ వారం రాత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో అచ్చెన్నాయుడు
టెక్కలి రూరల్: రావివలస పంచాయతీ చిన్న నారాయణపురానికి చెందిన పలువురు వైసీపీ నేతలు మంగళ వారం రాత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. కోటబొమ్మాళి మండ లం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో తురక కృష్ణారావుతో పాటు మరో ఆరు కుటుంబాలకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ టెక్కలి మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, నాయకులు బడే జగదీష్, ఇప్పిలి జగదీష్, దాసరి వాసు, నర్తు కృష్ణారావు, మల్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-15T00:10:43+05:30 IST