సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి
ABN, First Publish Date - 2023-06-26T22:46:42+05:30
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, మిని మం టైమ్ స్కేల్ అమలు చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘ చైర్మన్ మజ్జి మహేశ్వ ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్
అరసవల్లి, జూన్ 26: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, మిని మం టైమ్ స్కేల్ అమలు చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘ చైర్మన్ మజ్జి మహేశ్వ ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, డీఎంహెచ్వోకు వినతిపత్రం అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగ న్ మినిమం టైంస్కేల్ అమలు చేస్తామని, రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఉద్యోగుల పోరాటాల ఫలి తంగా వైద్యారోగ్యశాఖ ఉన్నత స్థాయి అధికారులు ఎన్ఎంహెచ్ ప్రతినిధులతో చర్చల్లో ఒప్పందం మేరకు జీవో నెం.60 ప్రకారం వేతనాలు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కానీ తొమ్మిది రోజుల వ్యవధిలో మళ్లీ తగ్గిస్తూ జీవో నెం.64 విడుదల చేయ డం అన్యాయమన్నారు. దీనిని నిరసిస్తూ జూలై 3న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని, 10న సామూహి కంగా జగనన్నకు చెబుదాం, చలో తాడేపల్లి కార్య క్రమాన్ని చేపడతామన్నారు. కార్యక్రమాల్లో ఉద్యోగు లంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Updated Date - 2023-06-26T22:46:42+05:30 IST