కేజీబీవీ సిబ్బంది సమస్యలు పరిష్కరించండి
ABN, First Publish Date - 2023-06-02T04:47:03+05:30
కస్తూర్బా విద్యాలయాల్లో సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా విద్యాలయాల్లో సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. సిబ్బందితో పాటు గురువారం విజయవాడలో కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. గెస్ట్ లెక్చరర్లను యథావిధిగా కొనసాగించాలని, తెలుగు ఇంగ్లిష్ పీజీటీలను తొలగించొద్దని విన్నవించారు. కొత్త నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగేలోపు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి రిక్వెస్ట్ బదిలీలు చేయాలని, అందరికీ ఎంటీఎస్ అమలుచేయాలని కోరారు. కాగా, ప్రస్తుతం పనిచేస్తున్న వారెవరినీ తొలగించబోమని, అవసరమైన ప్రదేశాలకు పని సర్దుబాటు మాత్రమే చేస్తామని కార్యదర్శి వారికి హామీ ఇచ్చారు.
Updated Date - 2023-06-02T04:47:13+05:30 IST