రాష్ట్రస్థాయి మహిళా బీచ్ కబడ్డీ విజేత శ్రీకాకుళం
ABN, First Publish Date - 2023-01-18T00:29:41+05:30
ఒంగోలు మం డలం కరవది గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ మహిళా కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచింది. గ్రామంలో ఈనెల 15వ తేదీ నుంచి సంక్రాంతి పండగ సందర్భంగా ఎన్టీఆర్ క్రీడాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థా యి బీచ్ మహిళీ కబడ్డీ పోటీలు మంగళవారి రా త్రితో ముగిశాయి. ఈ సందర్భంగా హోరాహోరీ గా జరిగిన పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజయం సాధించి టైటిల్ గెలుపొందింది.
రన్నర్గా నిలిచిన విశాఖపట్నం
ఒంగోలు(రూరల్), జనవరి 17: ఒంగోలు మం డలం కరవది గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ మహిళా కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచింది. గ్రామంలో ఈనెల 15వ తేదీ నుంచి సంక్రాంతి పండగ సందర్భంగా ఎన్టీఆర్ క్రీడాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థా యి బీచ్ మహిళీ కబడ్డీ పోటీలు మంగళవారి రా త్రితో ముగిశాయి. ఈ సందర్భంగా హోరాహోరీ గా జరిగిన పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజయం సాధించి టైటిల్ గెలుపొందింది. ఇక ఫైనల్లో ఓట మితో విశాఖపట్నం జట్టు రన్నర్గా నిలిచింది. తృతీయ స్థానంలో విజయనగరం, నాల్గో స్థానం లో గుంటూరు, ఐదో స్థానంలో ప్రకాశం, ఆరో స్థా నంలో పశ్చిమగోదావరి జట్లు నిలిచాయి. విజేత లకు వరుసగా రూ.30వేలు, రూ.25వేలు, రూ.20 వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.8వేలు నగ దు బహుమతులను అందజేశారు. కాగా విజేత శ్రీకాకుళం క్రీడాకారులకు గడ్డం శ్రీనివాసరావు రూ.1000 నగదు అదనపు బహుమతిగా ప్రదా నం చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ క్రీడాపరి షత్ అధ్యక్షుడు శిరిగిరి రంగారావు, కబడ్డీ అ సోషియేషన్ చైర్మన్ ఎన్.చంద్రహమోహనరెడ్డి, అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై. పూర్ణచంద్రరావు, ప్రథమ బహుమతి స్పాన్సర్ ముప్పిరి వెంకటేశ్వర్లు, పీడీ బాలు, కొల్లూరి బా బురావు, అంచెపోగులు వెంకటేశ్వర్లు పాల్గొన్నా రు. కాగా ఈ పోటీలను తిలకించేందుకు భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు.
=======3
Updated Date - 2023-01-18T00:29:42+05:30 IST