అయ్యో బాబు!
ABN, First Publish Date - 2023-06-01T01:37:13+05:30
ప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో కట్టి కంపచెట్ల మధ్య వదలిపెట్టి వెళ్లారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం గిద్దలూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది.
గోనె సంచిలో శిశువు
రక్షించిన రెవెన్యూ సిబ్బంది
విచారిస్తున్న పోలీసులు
గిద్దలూరు టౌన్, మే 31 : అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో కట్టి కంపచెట్ల మధ్య వదలిపెట్టి వెళ్లారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం గిద్దలూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది. కంపచెట్ల మధ్యలో గోనె సంచిలో కదులుతున్న బాలుడిని పందులు లాక్కుని వెళ్తుండటాన్ని గమనించిన రెవెన్యూ సిబ్బంది, స్థానికులు అనుమానంతో అటువైపు వెళ్లారు. పందులను తరిమికొట్టి సంచిని విప్పగా అందులో శిశువు కదులుతూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో డాక్టర్లు శిశువుకు చికిత్సనందిస్తున్నారు. చిన్నారిని గోనెసంచిలో కట్టి వదిలి వెళ్లిన వ్యక్తుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకోవాలని చూసిన వారు ఎవరై ఉంటారా అని పోలీసులు వైద్యశాఖ, సచివాలయాల ద్వారా ఆరా తీస్తున్నారు.
Updated Date - 2023-06-01T01:37:13+05:30 IST