ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2023-03-15T01:51:11+05:30

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జిల్లావ్యాప్తంగా కార్యక్రమం

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 14 : సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండు వద్ద జరిగిన నిరసనలో జేఏసీ జిల్లా చైర్మన్‌ కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా అనేక సమస్యలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వతేదీన జీతం ఇవ్వడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక పరమైన అంశాలన్నింటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా కలెక్టరేట్‌ యూనిట్‌ అధ్యక్షుడు ఊతకోలు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలయ్య, నాగేశ్వరరావు, రమేష్‌, రెవెన్యూ అసోసియేషన్‌ కోశాధికారి జె.డానియేలు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లాలోని అన్ని మండలకేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసనలు తెలిపారు.

Updated Date - 2023-03-15T01:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising