శిథిల భవనాన్ని కూల్చరా..?
ABN, First Publish Date - 2023-01-10T23:04:32+05:30
మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శిథిలమైన ఎమ్మార్సీ భవనం ఏళ్ల తరబడి అలాగే ఉంది. పైకప్పు దె బ్బతిని పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. గోడలు నెర్రలిచ్చాయి.
పొంచివున్న ప్రమాదంపై ప్రజల ఆందోళన
దర్శి, జనవరి 10 : మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శిథిలమైన ఎమ్మార్సీ భవనం ఏళ్ల తరబడి అలాగే ఉంది. పైకప్పు దె బ్బతిని పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. గోడలు నెర్రలిచ్చాయి. ఏ నిమిషంలోనైనా కూలే పరిస్థితి ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఎ నిమిదేళ్ల క్రితం అక్కడి నుంచి శిక్షణ కేంద్రం భవనంలోకి మారారు. అ ప్పటి నుంచి శిథిలమైన భవనం అలాగే ఉంచారు. అదే ప్రాంతంలో ఎంపీడీవో, వ్యవసాయ, గృహ నిర్మాణ, విద్యాశాఖ కార్యాలయాలతో పాటు భవిత విద్యా కేంద్రం ఉన్నాయి. నిత్యం ప్రజలు తిరుగుతూ ఉం టారు. ఆ భవనం కూలితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉం ది. భవనానికి నిర్మించిన తులపులు, కిటికీలు ఇతర సామగ్రి చెద లుపట్టి పోటుతున్నాయి. భవనాన్ని కూల్చేందుకు ఉన్నతాధికారుల అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపారు. అయినప్పటికీ ఈ విషయం గూర్చి అధికారులు పట్టించుకోడం లేదు. ఏ నిమిషంలో నైనా కూలిపోయే భవనాన్ని తొలగించకుండా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-01-10T23:04:34+05:30 IST