ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్శి ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2023-01-25T23:03:52+05:30

ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని చింతలపూడి గ్రామంలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గేదె బెదిరి మీదకు రావడంతో అధికారులు, జనాలూ పరుగులు

ముండ్లమూరు, జనవరి 25 : మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని చింతలపూడి గ్రామంలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కాటూరి చంద్రమౌళి ఇంటికి వెళ్తుండగా ఇంటి యజమాని రెండు రోజుల క్రితం ఒక గేదెను కొనుగోలు చేసి ఇంటి ముందు కట్టి వేసి దోమ తెర వేశారు. అదే సమయంలో ఒక్కసారిగా ఎమ్మెల్యేతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు వెంట నడుస్తుండగా గేదె బెదిరి ఒక్కసారిగా పలుగు తెంచుకొని జనాలను పొడిచింది. ఎమ్మెల్యే అప్రమత్తమై గేదె యజమాని చంద్రమౌళి ఇంటిలోకి పరుగెత్తారు. అనుచరులు, అధికారులదీ అదే పరిస్థితి. ఎంపీటీసీ దాసరి పెద అంజయ్యను, గేదె యజమాని కాటూరి చంద్రమౌళిని పొడవటంతో వారిద్దరికి గాయాలయ్యాయి. గేదె అంతటితో ఆగక దాదాపు 20 నిమిషాలు హల్‌చల్‌ చేసింది. వైసీపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని రక్షణగా నిలబడ్డారు.

Updated Date - 2023-01-25T23:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising