5,6 తేదీల్లో అపస్ రాష్ట్ర మహాసభలు
ABN, First Publish Date - 2023-02-18T21:54:29+05:30
నెల్లూరులో మార్చి 5,6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(అపస్) రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నామని, ఈ సభలను జయప్రదం చేయాలని అపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలాజీ పిలుపునిచ్చారు. శ
కావలిటౌన్, ఫిబ్రవరి18: నెల్లూరులో మార్చి 5,6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(అపస్) రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నామని, ఈ సభలను జయప్రదం చేయాలని అపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జనతాపేటలోని అపస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కెకె రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అపస్ అనేక పోరాటాలు చేసిందన్నారు. అపస్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి కే బ్రహ్మానందంకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బ్రహ్మానందంతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, సహాధ్యక్షులు రాజేశ్వర్, సీనియర్ నేతలు గూడల ప్రతాప్, రాధయ్య, వెంకట్రెడ్డి, రఘవర్ధన్, పేరయ్య, శ్రీనివాసులు, హర్ష తదితరులు పాల్గొన్నారు.
-------
Updated Date - 2023-02-18T21:54:31+05:30 IST