ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections:ఎమ్మెల్సీ స్థానాలకు మోగిన నగారా!

ABN, First Publish Date - 2023-02-10T02:28:18+05:30

ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీటిలో 9 స్థానిక సంస్థల సీట్లు

3 పట్టభద్రులు, 2 టీచర్‌ స్థానాలు

ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ

మార్చి 13న పోలింగ్‌.. 16న కౌంటింగ్‌

షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

న్యూఢిల్లీ/అమరావతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ 23. ఆ మర్నాడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 27 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికలు అనివార్యమైతే మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే నెల 16న ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే షెడ్యూల్‌తో ఎన్నికలు జరగనున్నాయి.

పదవీ విరమణ చేసేది వీరే..

స్థానిక సంస్థల కోటాలో నెల్లూరు-అనంతపురం ఎమ్మెల్సీ గునపాటి దీపక్‌రెడ్డి (టీడీపీ), కడప-బీటెక్‌ రవి (టీడీపీ) మార్చి 29న.. నెల్లూరు-వాకాటి నారాయణరెడ్డి (ప్రస్తుతం బీజేపీ), పశ్చిమ గోదావరి-అంగర రామ్మోహన్‌, మంతెన వెంకట సత్యనారాయణరాజు, తూర్పు గోదావరి-చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం-శత్రుచర్ల విజయరామరాజు, చిత్తూరు-బీఎన్‌ రాజసింహులు, కర్నూలు-కేఈ ప్రభాకర్‌ (అంతా టీడీపీ) మే 1న పదవీ విరమణ చేయనున్నారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి (పీడీఎఫ్‌), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి (వైసీపీ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ (బీజేపీ), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం (పీడీఎఫ్‌), కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్‌ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి మార్చి 29న రిటైర్‌ కానున్నారు.

Updated Date - 2023-02-10T02:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising