‘వక్ఫ్ బోర్డు భూమిని స్వాధీనం చేసుకోవాలి’
ABN, First Publish Date - 2023-03-31T00:07:32+05:30
జామీయ మసీద్కు సంబంధించి సర్వే నెంబర్ 325, 167లో ఉన్న 72 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకోవాలని ముస్లిం నాయకులు మహబూబ్, రహిమాన్, ఉసేని, అలీబాషా, అల్లా బకాష్, బహుద్దీన్ డిమాండ్ చేశారు.
పెద్దకడుబూరు, మార్చి 30: జామీయ మసీద్కు సంబంధించి సర్వే నెంబర్ 325, 167లో ఉన్న 72 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకోవాలని ముస్లిం నాయకులు మహబూబ్, రహిమాన్, ఉసేని, అలీబాషా, అల్లా బకాష్, బహుద్దీన్ డిమాండ్ చేశారు. గురువారం పెద్దక డుబూరులోని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన జామియా మసీద్కు సంబంధిం చిన భూమిని ముల్లా వారు అనుభవిస్తున్నారని అన్నారు. మసీద్ను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. మసీద్ అభివృద్ధి జరగాలంటే కలెక్టర్, జిల్లా వక్ఫ్బోర్డు అధికారులు స్పందించి భూమిని స్వాధీనం చేసుకొని ముల్లావారి కమిటీని రద్దు చేయాలన్నారు. దస్తగిరి, అజీజ్, ఖలీల్ సాబ్ పాల్గిన్నారు.
Updated Date - 2023-03-31T00:07:32+05:30 IST