వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపు: కేఈ
ABN, First Publish Date - 2023-02-07T00:13:02+05:30
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీదే గెలుపు అని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.
క్రిష్ణగిరి, పిబ్రవరి 6: వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీదే గెలుపు అని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కంబాలపాడు గ్రామంలో సోమవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న అమకతాడు మాజీ సర్పంచ్ ఉప్పరి నాగన్నను మాదాపురం గ్రామంలో పరామర్శించారు. సీనియర్ నాయకులు సద్దల ఈశ్వరయ్య, భాస్కర్ రెడ్డి, దివాకర్ రెడ్డి ఉన్నారు.
Updated Date - 2023-02-07T00:13:06+05:30 IST