బయల్పడిన సంగమేశ్వరుడు
ABN, First Publish Date - 2023-02-02T00:21:23+05:30
సప్తనదీ తీరంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి మంగళవారం పూర్తిగా బయల్పడింది.
కొత్తపల్లి, ఫిబ్రవరి 1:సప్తనదీ తీరంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి మంగళవారం పూర్తిగా బయల్పడింది. ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆలయంలో పేరుకు పోయిన బురదను భక్తుల సహకారంతో తొలగించి శుభ్రం చేయించారు. బుధవారం మాఘశుద్ధ ఏకాదశి రోజున ఆలయం ముందు మామిడి తోరణాలతో అలంకరించి వేపదారు శివలింగానికి సప్తనదీ జలాలతో అభిషేకించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివస్వాములు తొలిసారిగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
Updated Date - 2023-02-02T00:21:24+05:30 IST