‘సీఐటీయూ మహా సభలను విజయవంతం చేయండి’
ABN, First Publish Date - 2023-01-18T00:37:03+05:30
బెంగళూరులో ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పీఎస్.రాధాక్రిష్ణ పిలుపునిచ్చారు.
కర్నూలు(న్యూసిటీ), జనవరి 17: బెంగళూరులో ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పీఎస్.రాధాక్రిష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం కేకే భవన్లో మహా సభల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సంద ర్భంగా రాధాక్రిష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను కాలరాసే విధంగా మతోన్మాద విధానాలను అనురిస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను మహాసభలో రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, ఉపాధ్యక్షులు గౌస్దేశాయ్, రామాంజనేయులు, గోపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:37:07+05:30 IST