ఆసుపత్రి ఎదుట ఆందోళన
ABN, First Publish Date - 2023-02-21T00:52:50+05:30
ఆలూరు మండలంలో మొలగవల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల లేక వైద్య సేవలు అందడం లేదని టీడీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు భూపేష్, రామాంజనేయులు అన్నారు.
ఆలూరు, ఫిబ్రవరి 20: ఆలూరు మండలంలో మొలగవల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల లేక వైద్య సేవలు అందడం లేదని టీడీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు భూపేష్, రామాంజనేయులు అన్నారు. సోమవారం గ్రామస్థులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు వారు బైఠాయించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉండగా, అందులో ఒకరు శిక్షణ నిమిత్తం వెళ్లగా, మరో డాక్టర్ 5 నెలలుగా విధులకు హాజరు కావడం లేదని, అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతరం వైద్య సిబ్బందికి వినతిపత్రం అందించారు.
Updated Date - 2023-02-21T00:52:54+05:30 IST