కార్మిక వ్యతిరేక పార్టీలను గద్దె దించాలి
ABN, First Publish Date - 2023-06-26T00:14:01+05:30
కార్మిక వ్యతిరేక పార్టీలను గద్దె దించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప పిలుపుని చ్చారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప
కర్నూలు(న్యూసిటీ), జూన్ 25: కార్మిక వ్యతిరేక పార్టీలను గద్దె దించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప పిలుపుని చ్చారు. ఆదివారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడిదారులకు అను కూలంగా మారుస్తుందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని, ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే ఆపాలన్నారు. సీఎం జగన్మోహ న్రెడ్డి కేవలం పదివేల మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్ప డం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి జులై 8,9 తేదీల్లో ఒంగోలులో జరిగే యువ మహిళా రాజకీయ శిక్షణ తరగతులను, 10, 11 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే యువ కార్మికుల రాజకీయ శిక్షణ తరగతు లను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ సమావేశంలో అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు జే.లలితమ్మ, నాయకులు అజయ్బాబు, ఎన్.కృష్ణయ్య, నాగరాజు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:14:01+05:30 IST