ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబుకు తోడుగా మేము సైతం

ABN, First Publish Date - 2023-09-20T00:17:41+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బాబుకు తోడుగా మేము సైతం అంటూ మహిళలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

రిలే నిరాహార దీక్షలో మహిళలు

ఆదోని,సెప్టెంబరు 9: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బాబుకు తోడుగా మేము సైతం అంటూ మహిళలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అధ్యక్షతన ఉమాపతినాయుడు ఆఽధ్వర్యంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నల్ల జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, నియోజకవర్గ అబ్జర్వర్‌ గాజుల ఆదెన్న మాట్లాడారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీడీపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో దొడ్డనగేరి సర్పంచ్‌ పార్వతమ్మ, విజయలక్ష్మి, రమీజాబీ మగ్దుమ్‌, అంజూగాంధీ, రాజేశ్వరి, నూర్జహాన్‌, ఉమామహేశ్వరి, స్వప్న, శ్రీదేవి, సాదికా బేగం, అయ్యమ్మలతో పాటు ధనలక్ష్మి, నీరజా, శాంతి, ఈరమ్మ, జోతమ్మలు ఉన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ చౌదరి, టీడీపీ నాయకులు బసాపురం రామస్వామి, రంగన్న, సలకలకొండ ప్రతాప్‌ రెడ్డి, బుద్దారెడ్డి, తిమ్మప్ప, జయరాం, కల్లుబావి మల్లికార్జున, జగదీష్‌, కృష్ణారెడ్డి, మదిరె వీరేష్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శైలజ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising