క్రిష్ణాపురంలో 23 గొర్రెలు మృతి
ABN, First Publish Date - 2023-02-21T00:48:40+05:30
మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో పిచికారీ మందు ప్రభావంతో సుమారు 23 గొర్రెలు మృత్య వాత పడ్డాయి.
కోడుమూరు(రూరల్), ఫిబ్రవరి 20: మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో పిచికారీ మందు ప్రభావంతో సుమారు 23 గొర్రెలు మృత్య వాత పడ్డాయి. గ్రామానికి చెందిన కురువ మస్తాన్ అనే వ్యక్తికి సుమా రు 150 గొర్రెలు ఉన్నాయి. గొర్రెల బలంగా ఉండేందుకు టానిక్ కొని దాన్ని అందుబాటులో ఉన్న పురుగుమందు ఖాళీ డబ్బాలో పోసి తా గించాడు. సోమవారం మధ్యాహ్నం తాగించగా.. సాయంత్రంలోగా అవి అస్వస్థతకు గురయ్యాయి. పశువైద్యాధికారులు వచ్చి చికిత్స ప్రారంభిం చారు. కోలుకోలేక సుమారు 23 జీవాలు మృతి చెందాయి. మంగళవా రం జడ్పీటీసీ రఘునాథరెడ్డి గొర్రెల యజమానిని పరామర్శించి, చికిత్స అందిస్తున్న వెటర్నరీ వైద్యాధికారులు డాక్టర్ రామసుబ్బారెడ్డి, డాక్టర్ బాలస్వామిలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
Updated Date - 2023-02-21T00:48:44+05:30 IST