ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలి

ABN, First Publish Date - 2023-07-21T00:29:15+05:30

పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని సీఐటీయూ అనుబంధ ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు

ర్యాలీ నిర్వహిస్తున్న ముఠా కార్మికులు

ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలి

సీఐటీయూ నేత

బాబూరావు

గవర్నర్‌పేట, జూలై 20: పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని సీఐటీయూ అనుబంధ ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రెండేళ్లకు ఒకసారి పెంచే కూలి రేట్లు గడిచిన జూన్‌ ఒకటి నుంచి పెరగాల్సి ఉండగా తమ నోటీసులు యాజమాన్యాలకు అందజేసినా చర్చలకు పిలవకపోవడాన్ని నిరసిస్తూ గురువారం యూనియన్‌ ఆధ్వర్యంలో గవర్నర్‌పేట ఆలీబేగ్‌ వీధిలో కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు సీహెచ్‌ బాబూరావు, ముఠా సంఘం నేతలు ఎం. బ్రహ్మయ్య, ఎం. సీతారాములు మాట్లాడుతూ కూలి రేట్లు న్యాయంగా పెంచమని కోరుతున్నామని, యాజమాన్యాలు చర్చలకు పిలవకపోవడంతో నిరసన చేయాల్సి వస్తోందని తెలిపారు. గవర్నర్‌పేట ఆలీబేగ్‌ వీధి, పాత బస్టాండ్‌, బకింగ్‌హంపేట పోస్టాఫీసు, బీసెంటు రోడ్డు, జైహింద్‌ కాంప్లెక్‌ మీదుగా ఎన్‌టీఆర్‌ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ జరిగింది. సీఐటీయూ నాయకులు ఎంవీ సుధాకర్‌, కె. దుర్గారావు, ఈవీ నారాయణ చౌదరి, ముఠా సంఘం నాయకులు నర్సింహులు, ఎల్‌. వెంకట్రావు, శ్రీరాములు రెడ్డి, వెంకటరెడ్డి, ముఠా మేస్త్రీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising