విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీయాలి
ABN, First Publish Date - 2023-02-02T00:55:45+05:30
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు వెలికి తీయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అన్నారు. బుధవారం పెనమలూరు ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పెనమలూరు, ఫిబ్రవరి 1 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు వెలికి తీయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అన్నారు. బుధవారం పెనమలూరు ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటి అటల్ టింకరింగ్ హబ్గా పెనమలూరు ఉన్నత పాఠశాల ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ఎడ్యుకేషనల్ స్పెషలిస్టు శేషగిరి మధుసూదన్, కిషోర్ గైక్వాడ్, డీఈవో తాహెరా సుల్తానా, ఎంఈవో కనకమహాలక్ష్మి, ఎస్సీఈఆర్టీ నుంచి భాగ్యశ్రీ, సుదర్శన్, అటల్ టింకరింగ్ హబ్ ఇన్చార్జి డీవీ సుబ్బారావు, ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, పేరెంట్స్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-02T00:55:47+05:30 IST