ప్రజల తలపై అప్పుల కుంపటి పెట్టిన జగన్
ABN, First Publish Date - 2023-02-07T00:44:08+05:30
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి ప్రతి ఒక్కరి తలపై అప్పుల కుంపటి పెట్టాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల తలపై అప్పుల కుంపటి పెట్టిన జగన్
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమా
పాయకాపురం, ఫిబ్రవరి 6 : జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి ప్రతి ఒక్కరి తలపై అప్పుల కుంపటి పెట్టాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 59వ డివిజన్లో సోమవారం ఇదేం ఖర్మం మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ ఇంత వరకు నియోజకవర్గంలో సరైన రోడ్డు వేసిన పాపాన పోలేదని, ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ నరకం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నేతలు ఘంటా కృష్ణమోహన్, డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-07T00:44:10+05:30 IST