సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం
ABN, First Publish Date - 2023-03-26T00:55:36+05:30
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్క రించక పోతే ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి(బాపులపాడు తహసీల్దార్) సీహెచ్ నరసింహారావు తెలి పారు.
హనుమాన్జంక్షన్, మార్చి 25: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్క రించక పోతే ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి(బాపులపాడు తహసీల్దార్) సీహెచ్ నరసింహారావు తెలి పారు. ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన దశల వారీ ఆందోళన పిలుపులో భాగంగా శనివా రం బాపులపాడు తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు తహసీల్దార్ నరసింహారావు ఆధ్వ ర్యంలో వర్క్ టు రూల్ పాటించారు. సాయంత్రం 5.30 గంటలకు విధులను నిలిపి వేసి కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు రావాల్సిన హక్కులు, ఇతర సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించ కుండా పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని నరసింహరావు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు వెళ్లడానికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఏపీ జేఏసీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. డీటీ వెంకటరమణ, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-26T00:55:36+05:30 IST