ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీవెనల సిరి గుణదల పుణ్యక్షేత్రం

ABN, First Publish Date - 2023-02-07T01:19:23+05:30

గుణదల కొండపై కొలువైన మరియమాత తనను ఆశ్రయించిన వారిని తన అనుంగ బిడ్డలుగా ఆదరిస్తూ భక్తులపాలిట దీవెనల సిరిగా వెలుగొందుతుందని విజయవాడ కతోలిక పీఠం బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుణదల, ఫిబ్రవరి 6 : గుణదల కొండపై కొలువైన మరియమాత తనను ఆశ్రయించిన వారిని తన అనుంగ బిడ్డలుగా ఆదరిస్తూ భక్తులపాలిట దీవెనల సిరిగా వెలుగొందుతుందని విజయవాడ కతోలిక పీఠం బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు అన్నారు. గుణదలమాత మహోత్సవాలో భాగంగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్థనలు సోమవారం 7వ రోజుకు చేరుకున్నాయి. భక్తులు కొవ్వొత్తులు చేబూని మరియతల్లి గీతాలు ఆాపిస్తూ కొండ మధ్యలోగల మరియమాత గుహ వద్దకు చేరుకున్నారు. నెల్లూరు కతోలిక పీఠం బిషప్‌ పిడతల జోసఫ్‌ హాజరై మాట్లాడుతూ మరియమాత దేవుని తల్లి అయినప్పటికీ యేసుప్రభువు పట్ల ఎప్పుడూ వినయ విధేయతలతో మెలిగిందన్నారు. మోన్సిగ్ఞోర్‌ మువ్వల ప్రసాద్‌ మాట్లాడుతూ ఉత్సవాలకు ఇంకా 3రోజుల వ్యవధిమాత్రమే ఉండటంతో ఏర్పాట్లు త్వరగా పూర్తి చేస్తున్నామన్నారు. అనంతరం దివ్యపూజాబలి సమర్పించి భక్తులకు గురువులు దివ్యసత్ప్రసాదం అందజేశారు. ఎస్‌ఎ్‌ససీ డైరెక్టర్‌ తోట సునీల్‌రాజు, ఎన్‌.డేవిడ్‌ రాజు, పుణ్యక్షేత్రం రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising